ప్రముఖ మెసేజీంగ్ యాప్ Telegram వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజర్ బైజాన్ నుంచి పారిస్ కు వచ్చిన తరుణంలో బోర్గట్ విమానాశ్రయంలో ఆయనను పారిస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పావెల్ దురోవ్ పై గతంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కానీ ఆయన పారిస్ కువచ్చారు. దీంతో ఆయనను అరెస్టు చేశారు. ఆదివారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వాట్సాప్ కు ప్రత్యామ్నంగా టెలిగ్రామ్ యాప్ విస్తృతంగా ఆదరణ పొందింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 950 మిలియన్ల మంది యాక్టివ్ వినియోగదారులు ఉన్నాయి. ఇండియాలో 104.04 మిలియన్ల యూజర్స్ ఉన్నట్లు సమాచారం. అసలు ఈ పావెల్ దురోవ్ ఎవరు? ఎందుకు ఈయనను అరెస్ట్ చేశారు?
పావెన్ దురోవ్ రష్యాకు చెందిన వ్యక్తి. ఈయన వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్, టిక్ టాక్ యాప్ లకు ప్రత్యామ్నాయంగా Telegram యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీనిని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. భారత్ లో దీని యూజర్లు ఎక్కువగానే ఉన్నారు. వాట్సాప్ కంటే టెలిగ్రామ్ యాప్ యూజర్స్ ఇటీవల పెరుగుతున్నారు.
అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ గురించి ప్రధానంగా చర్చ సాగింది. ఉక్రెయిన్ యుద్ధ సమాచారం కోసం మాస్కో, కైవ్ అధికారులు దీనిని ఎక్కువగా ఉపయోగించారు. కొంత మంది దీనిని … అని పిలుస్తారు. గతంలో పోర్బ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పావెల్ దురోవ్ మాట్లాడుతూ 15.5 డాలర్ల బిలియన్ సంపదే లక్ష్యం అని తెలిపాడు. 2014లో వీ కొంటేక్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో టెలిగ్రామ్ యాప్ ను మూసివేయాలన్న డిమాండ్ వచ్చింది. దీంతో పావెల్ దురోవ్ రష్యాను విడిచిపెట్టాడు. రష్యాను విడిచిపెట్టిన తరువాత 2021లో పావెల్ దురోవ్ ఫ్రెంచ్ పౌరసత్వం పొందాడని రష్యా చెబుతోంది. అయితే 2017లో ఆయన దుబాయ్ కి వెళ్లినట్లు మరో మీడియా వివరించింది.
అయితే టెలిగ్రామ్ యాప్ ద్వారా మోసాలు, వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై ప్రస్తుతం ఆయనను పారిస్ అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.