Wednesday, June 25, 2025

రాఖీ కట్టేవారికి తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. 24 గంటల్లోనే..

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా రాఖీ పండుగను నిర్వహించుకుంటారు. ప్రతీ ఏడాది శ్రావణమాసం రాగానే రాఖీ పండుగ కోసం మహిళలు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఈ రోజు తమ తోబుట్టులను కలిసి రాఖీ కట్టి వారిని ఆప్యాయంగా చూసుకుంటారు. రాఖీ కట్టినందుకు తమ చెల్లెళ్లకు అన్నదమ్ములు బహుతులు ఇచ్చి అలరిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం కాలంలో చదువులు, పెళ్లిళ్ల కారణంగా అన్నాచెల్లెళ్లు దూరమవుతున్నారు. కొందరు అక్కా చెల్లెళ్లు అందుబాటులో ఉన్న తమ అన్నదమ్ములను నేరుగా కలిసి రాఖీ కడుతున్నారు. దూరపు ప్రదేశాల్లో ఉన్న వారికి పోస్టు లేదా కొరియర్ సర్వీసుల ద్వారా రాఖీలు పంపిస్తున్నారు. అయితే తెలంగాణ ఆర్టీసీ సంస్థ రాఖీ కట్టేవారికి గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి వారి మన్ననలను పొందుతోంది. గతంలోనూ రాఖీ పండుగ సందర్భంగా బస్సులో ప్రయాణం చేసే వారికి డ్రా సిస్టమ్ పెట్టి బహుమతులు అందించింది. ఇప్పుడు కొత్తగా మరో సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులను చేరవేయడంతో పాటు వివిధ సరుకులను చేరవేయడానికి ఆర్టీసీ కార్గోసర్వీసులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రాఖీలను పంపించుకునే అవకాశం కల్పించింది.

అయితే సాధారణ సరుకుల మాదిరిగా కాకుండా రాఖీలు పంపేవారికి ఆర్టీసీ కార్గో సంస్థల్లో ప్రత్యేక కౌంటర్లు తెరవనున్నారు. ఈ కార్గో ద్వారా రాఖీలు మాత్రమే కాకుండా స్వీట్ బాక్స్ లు, ఇతర బహుమతులు కూడా పంపించుకోవచ్చు. అంతేకాకుండా రాఖీలు పంపించేందుకు బుక్ చేసుకున్న 24 గంటల్లోనే గమ్యస్థానానికి చేరవేరుస్తారు. వీటికోసం ప్రత్యేకంగా డెలివరీ సదుపాయం కల్పిస్తారు. అయితే ఏయే ప్రదేశానికి ఎంత చార్జీలు కేటాయించారో మాత్రం చెప్పలేదు. దీనిపై ఆగస్టు 12న స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News