టీ20-2024 వరల్డ్ కప్ లో ఊహించని పరిస్థితి ఏర్పడింది. క్రికెట్ లో దిగ్గజంగా నిలుస్తున్న ఆస్ట్రేలియా టీం ను అప్ఘనిస్తాన్ ఇంటికి పంపించింది. బంగ్లదేశ్ పై విజయంతో అప్ఘనిస్తార్ సెమీ ఫైనల్ కు చేరడంతో ఆస్ట్రేలియాకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే సెమీస్ బెర్త్ దక్కించుకున్న టీమీండియాతో పాటు ఇప్పుడు అప్ఘనిస్తాన్ చేరింది. గతంలొో అప్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇప్పుడు మరోసారి బంగ్లాదేశ్ న అప్ఘనిస్తాన్ ఓడించిన కారణంగా కంగార్లు ఇంటి బాట పట్టారు. తాజాగా బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో అప్ఘనిస్తాన్ చేసిన 115 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ చేధించలేకపోయింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 8 పరుగుల తేడాతో అప్ఘనిస్తాన్ విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ తో పాటు ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టింది.