దాదాపు తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో ఉండిపోయినా సునీతా విలియమ్స్ ఎట్టకేలకు అనుకున్న సమయానికి భూమికి చేరింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3.26 గంటలకు సముద్రంలో అంతరిక్ష నౌక దిగింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక ద్వారా స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్ తో పాటు విల్మోర్ లు ఐఎస్ఎస్ కు వెళ్లారు. అయితే మీరు ఎనిమిది రోజులు మాత్రమే ఉండాల్సి ఉంది కానీ అనుకోకుండా సాంకేతిక కారణాలవల్ల తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు అమెరికాలోని నాసా స్పేస్ ఎక్స్ సహాయంతో చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. సునీతా విలియమ్స బృందం భూమ్మీదకు ఎలా దిగిందో ఈ వీడియోలో చూడండి..