నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటారు. కానీ నేటి కాలంలో ప్రతీ విద్యార్థి సాధారణ పౌరుడిగా ఉండాలనుకోవడం లేదు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపన పెరిగిపోతుంది. అందుకే వివిధ రంగాల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. ఆదర్శవంతమైన విద్యార్థులుగా మారాలంటే లక్ష్యం కోసం పనిచేయడం మాత్రమే కాదు. అందుకు సంబంధించిన ప్రణాళిక వేసుకోవాలి. ఈ క్రమంలో మంచి అలవాట్లను అలవరుచుకోవాలి. కొందరు సక్సెస్ అయిన విద్యార్థుల అలవాట్లు వేరే ఉంటాయి. వారు కొన్ని విషయాలను చెబితే ఇతరులకు ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ సక్సెస్ కావాలనుకునేవారికి ఇవి అలవర్చుకోవడం అతి ముఖ్యం. వీటిలో 6 అలవాట్లు ఉంటే విద్యార్థులు జీవితంలో గమ్యం చేరడానికి ఉపయోగపడుతాయని కొందరు నిపుణులు అంటున్నారు. మరి ఆ 9 అలవాట్లు ఏంటంటే?
వాయిదా..
ప్రతీ విద్యార్థికి ఉండాల్సిన ప్రధాన లక్ష్యం పనులు వాయిదాను నిరోధించడం. ఒక పని ఇప్పుడు చేయాలని అనుకుంటే ఇప్పుడే పూర్తి చేయాలి. కాలం మారుతున్నట్లే పరిస్థితులు మారుతాయి. అందువల్ల ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. పనులు వాయిదా వేసేవారు సక్సెస్ కాలేదు.
మల్టీ టాస్కింగ్..
ఒక పనిని చేయాలనుకుంటే దానిపైనే ఎక్కువగా శ్రద్ధ వహించండం. పది పనుల్లో నిమగ్నమైతే ఏ పనిని పూర్తిగా చేయలేదు. ఉదాహరణకు ఒక విద్యార్థి తనకు బాగా ఇష్టమైన సబ్జెక్టుకు సంబంధించిన కోర్సు తీసుకున్నప్పుడు అందులో లీనమైతే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. అలా కాకుండా ఒకే సారి రెండు లేదా ఇతర వాటిపై దృష్టి పెట్టడం వల్ల లక్ష్యాన్ని చేరుకోలేరు.
క్లాస్ మిస్సింగ్..
చాలా మంది స్టూడెంట్స్ తరగతులకు హాజరు కాకుండా డుమ్మా కొడుతుంటారు. కాలం ఎంతో విలువైనది. అలాగే ప్రతీ క్లాస్ చాలా ఇంపార్టెంట్. మిస్సయిన క్లాస్ లతో ఎన్నో విషయాలను కోల్పోతారు. అందువల్ల తప్పకుండా రెగ్యులర్ క్లాస్ కు అటెంట్ అవ్వండి.
సమయపాలన లేకపోవడం..
ఒక విద్యార్థి సక్సెస్ కు మరో ప్రధాన లక్ష్ణం టైం ప్లానింగ్.. ఒక ప్రణాళిక ప్రకారంగా చదువుకుంటూ పోతే అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. సమయం దొరికినప్పుడల్లా చదువుతాం లే.. అనుకుంటే కుదరదు. ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఆ సమయంలో చదిదేందుకు సిద్ధం కావాలి.
నిద్ర..
విద్యార్థుల మనసు ప్రశాంతంగా ఉండాలంటే కంటినిండా నిద్ర తప్పనిసరి. అనవసర విషయాలతో నిద్రను పాడు చేసుకోవద్దు. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండడం వల్ల నిద్ర పాడైపోయి మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. దీంతో చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు.
వ్యాపకం..
నేటి కాలంలో డిగ్రీ చదివే స్టూడెంట్ నుంచి మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే దీనిని చదువు కోసం మనసు ప్రశాంతంగా ఉండడం కోసం డుకుంటే తప్పులేదు. కానీ ఇది వ్యసనంగా మారితే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని, ఉదయం మొబైల్ తోనే లేచే విద్యార్థులు ఎప్పటికీ సక్సెస్ కాలేరు.