బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై బెంగాల్ పోలీసులు వివిధకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మెట్రోపాలిటన్ డిటెక్టివ్ పోలీసులు బంగారం స్మగ్లింగే హత్యకు కారణమై ఉంటుందని అనుమానించారు. అయితే తాజాగా వారి అనుమానాలకు కొన్ని విషయాలు బలం చేకూరుతున్నాయి. బంగ్లాదేశ్ ఎంపీ, అతని స్నేహితుడి మధ్య రూ. 80 కోట్ల వ్యవహారమే హత్యకు దారి తీసిందని తెలుస్తోంది.
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు కారణం అతని స్నేహితుడు ఎండీ అఖ్తరుజ్జమాన్ అలియాస్ షాహీన్ల మధ్య బంగారం స్మగ్లింగ్ కు సంబంధించిన వ్యవహారమే అని తెలుస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ ఇంటలీజెన్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ లోని ఖుల్నా డివిజన్ లో జెనైదా -4 కు ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ ప్రాతినిత్యం వహిస్తున్నాడు. తన నియోజకవర్గంలోని జెనైదాలోని కొట్ చంద్ పూర్ మునిసిపాలిటీకి షాహీన్ మేయర్ గా ఉన్నారు. కోట్ చంద్ పూర్ మునిసిపాలిటీ భారత్ లోని పశ్చిమ బెంగాల్ సరిహద్దున ఉంటుంది.
గత సంవత్సరం బంగారం స్మగ్లింగ్ విషయంలో అజీజ్ పెద్దమొత్తం మొత్తం డిమాండ్ చేయడంతో ఎంపీ, మేయర్ మధ్య విభేదాలు వచ్చాయి. ఒక రకంగా షాహీన్ ప్రతిపాదన తిరస్కరించినప్పటికీ రూ.80 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. కానీ అప్పటి ఎంపీ, మేయర్ మధ్య ఉన్న స్నేహం ద్వేషంగా మారింది. ఇందులో భాగంగా షాహీన్ తో పాటు మరికొందరు అజీమ్ ను హత్య చేయడానికి ప్లాన్ వేశారనే కోణంలో బంగ్లాదేశ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.