Tuesday, June 24, 2025

ఫైలట్ అప్రమత్తం.. 400 మంది ప్రాణాలు సురక్షితం..

ఓ విమానానికి గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే మంటలు అంటుకున్నాయి. అయితే ఫైలట్ లో చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కెనడాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం కెనడాలోని టోరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి జూన్ 5న రాత్రి 8.46 గంటగలకు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే దీనికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. విమానం రెక్కల వద్ద మంటలు అంటుకున్నట్లు వీడియోలో రికార్డు అయింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఫైలట్ లు అప్రమ్తంగా వ్యవహరించారు. దీంతో వెంటనే అదే ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు. ఇందులో 400 మంది ప్రయాణిస్తున్నారు. ఫైలట్ ల జాగ్రత్తతో వీరు సురక్షితంగా ఉన్నారు. లేకుంటే పెను ప్రమాదమే జరిగేది. అయితే ఇది ఇంజిన్ కంప్రెసర్ వల్లే జరిగిందని ఎయిర్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి తిరిగి దీనిని వినయోగిస్తామని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News