Tuesday, June 24, 2025

త్వరలో ‘ఆపరేషన్ సింధూర్’ మూవీ.. పోస్టర్ విడుదల..

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో ప్రతి ఒక్క భారతీయుడిలో అలజరి రేకెత్తుతోంది.సాధారణ పౌరులు నేరుగా యుద్ధంలో పాల్గొనకున్నా.. శత్రు దేశంపై గెలవాలన్న కసితో ఉన్నారు. ఈ క్రమంలో వారికి తోచిన విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు సోషల్ మీడియానే వేదికగా మారింది.

తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టర్ సంచలనంగా మారింది. ‘ఆపరేషన్ సింధూర్’ మూవీ రాబోతున్నట్లు ఓ పోస్టర్ ను తయారు చేసి అప్లోడ్ చేశారు. ఈ పోస్టర్ లో ‘భారత్ మాతా కీ జై’ అని రాసి ఉంది. ఓ మహిళ ఆర్మీ యూనిఫాంలో ఉండి చేతిలో గన్ పట్టుకొని ఉండడంతో ప్రస్తుతం భారత్, పాక్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలోనే ఈ మూవీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే సినిమాను నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్, దిం కంటెంట్ ఇంజనీర్ కలిసి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఉత్తమ్ మహేశ్వరి, నితిన్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ టైటిల్ కోసం పలువురు నిర్మాతలు పోటీ పడ్డారు. చివరికి నిక్కీ విక్కీ భగ్నానీకి దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇందులో మెయిన్ క్యారెక్టర్ గా ఎవరు ఉంటారనేది చూడాలి. ఈ సినిమాలో పహల్గాం వంటి సన్నివేశాలు చూపిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.

మరోవైపు ఓ వైపు యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ టైటిల్ తో సినిమా తీయడంపై కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం సమయంలో ప్రతి ఒక్క భారతీయుడు యుద్ధానికి సహకరించాల్సిందిపోయి ఇలాంటివి అవసరమా? అని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News