Wednesday, June 25, 2025

ఉల్లి, టమాట ధరలు పైపైకి.. ఈరోజు ఎలా ఉన్నాయి? అసలెందుకు ఇలా?

కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా వేసవిలో ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి వర్షాకాలం ప్రారంభం కాగానే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో ఉల్లి, టమాట సహా అన్ని కూరగాయల ధరలు 60 శాతం పెరిగాయి. మే మూడో వారంలో ఉల్లి కిలో రూ.20 ఉండగా.. ప్రస్తుతం రూ.50కి చేరింది. టమాటా ధర కూడా రెండింతలు పెరిగింది. నిన్నటి వరకు కిలో రూ.5 ఉండగా ఇప్పుడు రూ.50తో అమ్ముతున్నారు. టమాటతో పాటు బీన్స్, వంకాయలు, ఇతర కూరగాయల ధరలు పెరిగాయి. ఆకుకూరల ధరలు భారీగా పెరిగాయి.

డిమాండ్ కు తగ్గట్టుగా సరిపడా ఉల్లి మార్కెటు రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు వెలుతున్నాయి. గతంలో హైదరాబాదుకు రోజూ 8 వేల క్వింటాళ్ల ఉల్లిగడ్డ వస్తే ప్రస్తుతం 5 వేల క్వింటాళ్ల వరకే వస్తున్నది. ప్రభుత్వం డిమాండ్ ను అంచనా వేసి ఆ మేరకు నిల్వలను అందుబాటులోకి తీసుకుకొచ్చి ధరలు తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. అియతే గత నెల బావులు, బోర్ల, కింద కూరగాయాల వంటలు వేశారని, వంట దిగుబడి మొదలైతే, వచ్చే రెండు నెలల్లో ధరలు తగ్గుముఖం పట్టే ఆవకాశం ఉన్నదని మార్కెటింగ్ అధికారులు రెబుతున్నారు.

తెలంగాణ జనాభాకు ప్రతి ఏడాది 38.84 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయని ఒక అంచనా. అయితే ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల వంటలు సాగవుతున్నాయి. అందులో కూరగాయల వంటలు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగా జనాభా అవసరాలను సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తున్నది. ఉల్లిగడ్డల ధరలు 21 శాతం, బమాటా ధరలు 26 శాతం, అలుగడ్డల ధరలు 20 శాతం, వంట నూనెల ధరలు 15 శాతం పెరిగినట్టు క్వాంటికో రీసెర్చ్ సంస్థ తెలిపింది. ‘వడగాలులు, అకాల వరాల వేపథ్యంలో ఉల్లి, టమాట దిగుబడిపై ప్రభావం పడింది. దీంతో మార్కెల్లోకి వచ్చే అల్లి, టమాట దిగుబడి భారీగా తగ్గిపోయింది. వచ్చేది పండుగల సీజన్ దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు.. తమ వంటను వివణిలోకి తీసుకురావడాన్ని అలస్యం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కువ ధర వస్తుందనే వాళ్లు ఇలా చేస్తున్నారు. వెరసి డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఉల్లిగడ్డలు, అలుగడ్డల ధరలు భారీగా పెరుగుతున్నాయి’ అని క్యాంటినో రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.

ఈసారి వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతిని చేసుకున్నారు. దీంతో మే వరకు ధరలు దాదాపు అదుపులోనే ఉన్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు పడిన తరువాత దిగుమతిలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సమయంలో వర్నాలు పడడం వల్ల అవి తడిసిపోవడం, కుళ్లిపోవడం వంటి పరిణామాల దృష్టా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్ నగర జనాభాకు ప్రతి రోజు దాదాపు 3,300 టన్నుల కూరగాయల అవసరం ఉంటుంది. కానీ వారం రోజులుగా అన్ని హోల్ సేల్ మార్కెట్లకు 2,800 టన్నుల సరుకు మాత్రమే వస్తోంది. మరోవైపు ధరలు పెరిగిన నేపథ్యంలో కొనుగోళ్లు పెద్దగా జరుగడం లేదని, దీంతో ఉన్న సరుకు పాడైపోయి, పెట్టుబడి కూడా రావడం లేదని వ్యాపారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News