Wednesday, June 25, 2025

జూలై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు.. ఇవి ఎలా ఉంటాయంటే?

భారతదేశంలో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. బ్రిటీష్ కాలం నాటి నుంచి ఉంటున్న చట్టాలను మోదీ ప్రభుత్వం ప్రక్షాళన చేయనుంది. పాత 3 నేర చట్టాల స్థానంలో కొత్త వాటిని చేర్చనున్నారు. ఇవి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి (IPC), నేర శిక్షాస్మృతి (CrPC), భారత సాక్ష్యాధార చట్టం 1872 స్థానంలో..భారతీయ న్యాయ సంహిత (BNS) 2022, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(BNSS) 2023, భారతీయ సాక్ష(BS) అధిలియమ్ 2023 పేరుతో మూడు చట్టాలు జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా అనులులోకి రామన్నాయి.

భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ సాక్ష్య-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023లు 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్- 1872 స్థానాలను భర్తీ చేయనున్నాయి. వీటికి 2023లో పార్లమెంట్ అమోదం తెలిపింది. డిసెంబర్లో రాష్ట్రవతి ద్రౌవది ముర్ము ఆమోదం తర్వాత చట్టాలుగా మారాయి. జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టిచంపడం వంటి నేరాలకు లకు ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏడేళ్లు అంతకు పై బడిన శిక్ష పడిన నేరాల్లో ఫొరెన్సిక్ తప్పనిసరి అని ఈ చట్టాలు చెబుతాయి. భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలు చేర్చగా, పాత వాటిలో ఉన్న 19 నిబంధనలను తొలిగించారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నిబంధనల్లో జరిమానా పెంచారు. 23 నేరాలలో తప్పనిసరి కనీన శిక్షను ప్రవేశపెట్టారు.

కొత్త చట్టాలు భారతీయత భారత రాజ్యాంగం, ప్రజల శ్రేయస్సులు ప్రాధాన్యతనిస్తాయని హోం మంత్రి అమిత షా గతంలో చెప్పారు. జీరో ఎఫ్ఐఆర్, ఆన్ లైన్లో పోలీస్ ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు దారుణమైన నేరాలకు సంబంధించిన వీడియో వంటివి ఇందులో చేర్చారు. ఈ చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఫిర్యాదు చేయొచ్చు. ఆన్ లైన్ లోనే ఫిర్యాదు చేసే వీలుకలుగనుంది. తర్వారా తేలికగా, వేగంగా సమాచారాన్ని తెలియజేయడంతోసాలు పోలీస్ స్పందనను సులభతరం చేస్తుంది. ఏదైనా సంఘటన సమాచారాన్ని ఏ పోలీస్ స్టేషన్ కైనా ఆన్లైన్లో తెలియజేయవచ్చు.జీరో ఎప్ఐఆర్ ప్రకారం? ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు బాధితులతోపాటు విండితులు కూడా ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా పొందవచ్చు. పోలీస్ రిపోర్టు, సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించేవచ్చు.

పిల్లలు, మహిళలపై నేరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స లేదా పూర్తి వైద్యం ఉచితంగా పొందవచ్చు. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. మహిళలు, దివ్యాంగులు.. దీర్ఘకాల వ్యాధిగ్రస్థులతోపాలు15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు నివాసం ఉన్న చోటే పోలీస్ సాయం పొందవచ్చు. స్వల్ప నేరాలకు సంబంధించి నేరస్థులకు సమాజ సేవ చేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News