IPL 2024 (7వ సీజన్) టైటిల్ ను కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. చెపాక్ లో ఆదివారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా సన్ రైజర్స్ ఏర్పాటు చేసిన లక్ష్యం చిన్నదైనా కోల్ కతా కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఏదీ ఏమైనా టైటిల్ ను గెలుచుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వ్యాప్తంగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో కోల్ కతా జట్టు లోని ఆటగాళ్లపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందులో సునీల్ నరైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే సునీల్ ‘మోస్ట్ వాల్యూయేబుల్ క్రికెటర్’గా నిలిచాడు. మరి అతడు సాధించిన రికార్డులేవో చూద్దాం..
సునీల్ ఫిలిప్ నరైన్ వెస్టీండీస్ క్రికెటర్. ఈయన 1988 మే 26న జన్మించాడు. 2011 డిసెంబర్ లో ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ ద్వారా ఫీల్డులోకి ఎంట్రా ఇచ్చాడు. ఆల్ రౌండర్ (ఎడమ చేతి బ్యాట్ మన్) అయిన ఈయన 2012లో వెస్టిండీస్ టీ 20 కప్ గెలిచిన సమయంలో అందులో కీలకంగా ఉన్నాడు. దీంతో 2014 మార్చి 8 నాటి టీ 20 బౌలర్ల ర్యాంకింగ్ లో 784 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. టీ20 మ్యాచులో సూపర్ ఓవర్ లో మెయిడిన్ బౌలింగ్ చేసిన ఏకైక బౌలర్ సునీల్ఉ మాత్రమే. అయితే 2023 నవంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ నరైన్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో కొనసాగుతూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. దీంతో ఐపీఎల్ క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ వాల్యూయేబుల్ పర్సన్ గా నిలిచాడు. ఈయన 2012లో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 5 వికెట్లు తీసుకున్నాడు. ఆ సీజన్ లో మొత్తం 24 వికెట్లు తీసుకున్నాడు. ఆ తరువాత 2013 సీజన్ లో ఇదే పంజాబ్ పై మరోసారి చెలేరిగి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. అలాగే సెంచరీ చేసి శెభాష్ అనిపించుకున్నాడు.
అలాగే 2018లో 357 రన్స్, 17 వికెట్లు తీసుకున్నాడు. ఇక తాజా ఐపీఎల్ సీజన్ లోనూ చెలరేగిపోయాడు. మొత్తంగా 488 పరుగులు, 17 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు సునీల్ సరైన్ ఐపీఎల్ లో 100 వికెట్లు తీసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఆయన 170 వికెట్లు తీసుకోవడం విశేషం. ఈ సందర్భంగా సునీల్ సరైన్ గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది.