మాంసాకృతుల్లో చేపలు కూడా ఉంటాయి. అయితే చాలామంది చికెన్, మటన్ కంటే చేపలను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇందులో ముల్లు ఎక్కువగా ఉంటాయి.. వాటిని తీసేయడం ఇబ్బందిగా ఉంటుంది.. ఇలాంటప్పుడు కొందరు పచ్చి చేపల కంటే ఎండు చేపలని ఎక్కువగా తింటూ ఉంటారు. ఎందుకంటే ఎండు చేపలను తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎండు చేపలు ఎక్కువగా ఘాట్ అయిన స్మెల్ వస్తుంటాయి. అంతేకాకుండా వీటి గురించి చాలామందికి అవగాహన లేదు. అయితే పచ్చి చేపల కంటే ఎండు చేపలే ఎంతో మేలు ఇస్తాయని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఎండు చేపల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే?
పచ్చి చేపలను సాధారణంగా వారం రోజులపాటు నిల్వ ఉంచి తినవచ్చు. కానీ ఎండు చేపలను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులోని నీరంతా బయటకు వెళ్తుంది కాబట్టి పోషకాలు అలాగే ఉంటాయి. ఎండు చేపల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్పరస్ వంటివి ఉన్నాయి. అలాగే ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఇందులో లభ్యమవుతాయి.

దీంతో ఎండు చేపలను తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కండరాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఎండు చేపలను తినడం వల్ల నాడీ వ్యవస్థను సక్రమంగా చేసి గుండె పని తీరును మెరుగ్గా ఉంచుతుంది. ఇందులో ఫాస్ఫరస్ ఉండడంతో ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే కండరాలు పటిష్టంగా ఉండడానికి ఇవి సహాయపడతాయి. కంట్లో సమస్యలు ఉన్నవారు రెండు చేపలను అప్పుడప్పుడు తింటూ ఉండాలి.
కొన్ని గ్రామాల్లో ఎక్కువ శాతం మంది పచ్చి చేపల కంటే ఎండు చేపలనే ఎక్కువ మంది తింటూ ఉంటారు. ఇవి ప్రాసెస్ చేయడం తేలికగా ఉండడంతో పాటు తక్కువ ధరలో లభ్యమవుతాయి. అంతేకాకుండా వీటిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అందువల్ల వీలైతే రెండు చేపలను తినే ప్రయత్నం చేయండి..