ఛత్తీస్ గఢ్ లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది స్పాట్ లోనే మృతి చెందారు. రాష్ట్రంలోని బెమెతార జిల్లాలోని బెర్లా బ్లాక్ లో గన్ పౌడర్ తయారీ కేంద్రంలో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. బెర్లా బ్లాక్ లోని ఫ్యాక్టీరీలో ఈ ప్రమాదం జరగడంతో ఫ్యాక్టరీ శిథిలాల కింద ఇంకా కార్మికులు ఉండే అవకాశం ఉంది. గాయపడ్డవారిని రాయ్ పూర్ లోని మెహకారా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి బెమెతెర జిల్లా కలెక్టర్ సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
