ప్రపంచంలో అగ్ర రాజ్యం ఏదంటే ముందుగా యూనైటైడ్ స్టేట్స్ గురించి చెబుతూ ఉంటారు. ఆర్థికంగా అందరికంటే ముందు వరుసలో ఉన్న అమెరికాను పెట్టుబడి దారి వ్యవస్థగా పేర్కొంటారు. అయితే ఇక్కడ రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటే.. ఇక్కడ రాజ్యాంగ సమాఖ్య రిపబ్లిక్ గా ఉంటుంది. భారత్ లో సర్పంచ్ ల నుంచి ప్రధాని వరకు ప్రజలే ఎన్నుకునే వ్యవస్థ ఉంటుంది. కానీ ఇక్కడ అధ్యక్షుడిని పరోక్షంగా ఎన్నుకుంటారు. 2024 నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? అక్కడి ఓటింగ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం..
అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ఆ దేశంలోని ప్రజలు మాత్రమే కాదా.. ప్రపంచ దేశాలకు ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి దేశాధ్యక్షుడు ఎవరో తేలితే ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయని కొన్ని దేశాలు ముందే అంచనా వేసుకుంటాయి. ప్రస్తుతం అధ్యక్ష బరిలో రిపబ్లిక్ పార్టీ తరుపున డోనాల్డ్ ట్రంప్ బరిలో ఉండగా.. డెమొక్రటిక్ నుంచి కమలాహారీస్ పోుటీ చేస్తున్నారు. కమలా హారీస్ ప్రస్తుతం అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

అమెరికా మొత్తంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉంటాయి. ఇవి మాత్రమే బరిలో ఉంటాయి. రాష్ట్రప్రైమరీలు, కాకస్ అని పిలిచే ఓటింగ్ ద్వారా ఈ పార్టీలను నామినేట్ చేస్తారు. ఈ పార్టీల తరుపున ఎవరు పోటీ చేయాలో కూడా నిర్ణయిస్తారు. రిపబ్లిక్ పార్టీలో డానాల్డ్ ట్రంప్ కు ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనే అధ్యక్ష బరిలో ఉన్నారు. విస్కాన్సిన్ లోని మిల్వాకీలో జరిగిన సమావేశంలో డొనాల్డ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. డెమొక్రటిక్ తరుపున ముందుగా జో బైడెన్ అనుకున్నా.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆయనే తప్పుకోవడంతో కమలాహారిస్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. ఇక్కడ ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా ‘ఎలక్టోరల్ ఓట్లు’ ఉంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 నుంచి అంతకంటే ఎక్కువ వచ్చిన వారు విజయం సాధించినట్లు. ఈ ఓట్లు అమెరికాలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు వేయొచ్చు. అమెరికాలో దూర ప్రాంతాలు ఎక్కువ కాబట్టి ఆన్ లైన్ లోనూ ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే 12 రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి. వీటిని స్వింగ్ రాష్ట్రాలు అని అంటారు. పార్టీలు ఈ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం ఎక్కువగా నిర్వహిస్తారు. అయితే ఎలక్టోరల్ ఓట్లు తక్కువగా ఉండి .. సొంతంగా ఓట్లు ఎక్కువగా వచ్చినా విజయం సాధించలేరు.

భారత్ కు లోక్ సభ, రాజ్య సభ ఉన్నట్లే.. అమెరికాలో సెనెట్ ఎన్నికలతో పాటు చట్టాలను చేసే కొత్త సభ్యులను కూడా ఎన్నుకుంటారు. దీనినే కాంగ్రెస్ ప్రతినిధుల సభ అని అంటారు. ఇందులో 435 మంది సభ్యులుంటారు. 34 స్థానాల్లో అభ్యర్థులు బరిలో ఉండి ఎన్నికల్లో పోటీ పడుతారు. చివరగా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఇదే రోజు విజేతను ప్రకటిస్తారు. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం మెట్లపై ప్రమాణ స్వీకారం చేస్తారు.