పారిస్ ఒలంపిక్స్ లో భారత్ విరోచిత పోరాటం చేస్తోంది. ప్రపంచ క్రీడా వేదికపై భారత్ పేరును నిలబెట్టేందుకు మన ఆటగాళ్లు ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారు. అయినా కొన్ని దురదృష్టాలు వెంటాడుతున్నాయి. అయినా వెనుదిరిగి చూడకుండా ఏదో ఒక పతకం సాధిస్తూ భారత్ జెండాను ఎగువేస్తున్నారు. తాజాగా జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా మరోసారి మెరిశాడు. గత ఒలంపిక్స్ లో ఈయన స్వర్ణం సాధించగా.. ఈసారి వెండి పతకం సాధించాడు. సాధారణంగా కొందరు క్రీడాకారులు ఒకసారి ఏదో పతకం తీసుకొస్తే మరోసారి కష్టతరంగా మారింది. కానీ నీరజ్ చోప్రా చరిత్ర చూడకుండా వరుసగా రెండోసారి విజేతగా నిలిచారు. ఇక హాకీ విభాగంలో కాంస్యం వచ్చి సంతృప్తిని ఇచ్చారు. అయితే భారత్ ఇప్పటి వరకు ఎన్ని పథకాలను? ఏ యే రంగంలో సాధించిందో చూద్దాం..
2024 పారిస్ ఒలంపిక్స్ జూలై 26 నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. జావెలిన్ త్రో, హాకీ, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ తో సహా మొత్తం 32 క్రీడల్లో పాలు పంచుకోనున్నారు. పారిస్ ఒలంపిక్స్ లో భారత్ 27 నుంచి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. అయితే మొదటి రోజు ఎలాంటి పతకం రాలేదు.
- జూలై 28న 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (షూటింగ్) మహిళల విభాగంలో మనుభాకర్ కాంస్య పతకం సాధించారు. ఆ తరువాత 30వ తేదీన 10 మీటర్ల మిక్స్ డ్ ఎయిర్ పిస్టల్ టీంలో లోనూ కాంస్యం దక్కించుకున్నారు.
- ఆగస్టు1న 50 మీటర్ల రైఫిల్ (షూటింగ్) లో పురుషుల విభాగంలో స్వప్పిల్ కుసలో కాంస్య పతకం సాధించారు.
- ఆగస్టు 8న పురుషుల హాకీ విభాగంలో కాంస్యం పతకం వచ్చింది
- ఆగస్టు 8న జావెలిన్ త్రో (అథ్లెటిక్స్) లో నీరజ్ చోప్రా రజతం సాధించారు.
ఇప్పటి వరకు షూటింగ్ విభాగంలో 3 (కంచు), హకీ విభాగంలో 1(కంచు), అథ్లెటిక్స్ 1(రజతం) వచ్చాయి. అంటే ఆగస్టు 8 వరకు మొత్తం 5 పతకాలు సాధించారు. అయితే రెజ్లింగ్ విభాగంలో వినేశ్ పొగాట్ పతకం సాధించే అవకాశం ఉండగా.. అనర్హత కారణంగా చేజారి పోయింది. ఈనెల 11 వరకు పారిస్ ఒలంపిక్స్ సాగనున్నాయి అప్పటి వరకు ఎన్ని పతకాలు వస్తాయో చూడాలి.