Tuesday, June 24, 2025

హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ కు ట్రైన్ జర్నీ చేసేవారికి గుడ్ న్యూస్.. ఇక ఏడున్నర గంటల్లోనే ..

హైదరాబాద్ నుంచి నాగపూర్ కు నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. విద్యార్థులు, వ్యాపారులు తమ అవసరాల కోసం హైదరాబాద్ నుంచి వెళ్తుంటారు. నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు వస్తుంటారు అయితే ఇక్కడికి బస్సుల్లో వెళ్లాలంటే చాలా కష్టం అవుతుంది. అందువల్ల ట్రైన్ జర్నీ ఎక్కువ చేస్తుంటారు. హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ కు 42 వారాంతపు రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు నగరాల మధ్య 578 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణ ఎక్స్ ప్రెస్, బెంగుళూరు రాజధాని ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ అనే రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. మిగతా రైళ్ల ద్వారా హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ కు వెళ్తుంటారు. ఈ రైళ్ల ద్వారా జర్నీ చేయాలంటే 8 గంటల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఏడున్నర గంటల్లోనే హైదరాాద్ నుంచి నాగ్ పూర్ కు వెళ్లొచ్చు.. అదెలాగంటే?

ప్రయాణికులు వేగవంతంగా గమ్యానికి చేర్చడానికి భారత రైల్వే వ్యవస్థ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ కు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే తీసుకున్న ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 15న ఈ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 7.15 గంటల్లోనే గమ్యానికి చేరుతుంది.

సికింద్రాబాద్ నుంచి ఉదయం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమయ్యే ఈ రైలు రాత్రి 8.20 గంటలకు నాగ్ పూర్ లో ఉంటుంది. ఇక్కిడి నుంచి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో స్టాప్ ఉంటుంది. అంటే హైదరాబాద్ లో కాకుండా తెలంగాణకు చెందిన వారు కాజీపేట, రామగుండంలో కూడా ఈ ట్రైన్ లో వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే నాగ్ పూర్ నుంచి సికింద్రాబాద్ కు రావాలంటే ఉదయం 5. గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ లో ఉంటుంది.

తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి వైజాక్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ సాగుతున్నాయి. ఇప్పుడీ కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వస్తే నాగ్ పూర్ కు వెళ్లే వారికి సౌకర్యం ఏర్పడుంది. వాణిజ్య కేంద్రంగా ఉన్న నాగ్ పూర్ కు నిత్యం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే బల్లార్షా, చంద్రాపూర్ కు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. కొత్తగా ప్రారంభించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో ఎంతో మందికి ఉపయోగం కానుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News