విశాఖపట్నంలోని తిరుమల ఎక్స్ ప్రెస్ ప్రమాదంతో ఒక్కసారిగా ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగనందున అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం గల కారణాలేంటో తెలుసుకునేందుకు పోలీసలు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమికంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం బోగీలకు అంటుకున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? అందుకు కారణాలేంటి?
విశాఖ పట్నం నుంచి కడకపు బయలు దేరేందుకు తిరుమల ఎక్స్ ప్రెస్ విశాఖ రైల్వే స్టేషన్లో నిలిచి ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా రైల్వేలో మంటలు చెలరేగాయి. ఈ రైలులో ని బీ6, బీ7, ఎం 1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
కొర్బా నుంచి విశాకకు వచ్చిన ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు ఈ రైలు కడపకు వెళ్లనుంది. దీంతో చాలా మంది ప్రయాణికులు రైలులో వెయిట్ చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని చర్చించుకుంటున్నారు. ఈ ప్రమాదంలో బోగీల్లోని బెడ్ సీట్లు, థర్మకోల్ బెర్తులు కాలిపోయాయి.
ఇదిలా ఉండగా ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తోనే జరిగినట్లు భావిస్తున్నారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా పరిశీలించేందుకు దర్యాప్తు చేపట్టారు. కానీ ఏసీ గదుల్లోనే ఈ మంటలు రావాడంతో షార్ట్ సర్క్యూట్ అని భావిస్తున్నారు. అయినా పూర్తి వివరాలు అధికారులు వెల్లడించే వరకు సస్సెన్స్ గానే ఉండనుంది.