సగం మానవ శరీరం, మరో సగం సింహం దేహాన్ని కలిగిన నారయణుడు ప్రహ్లదుడి భక్తికి మెచ్చి నరసింహుడి రూపంలో ఆవిర్భవిస్తాడు. మహా విష్ణువు నరసింహుడి రూపంలో అవతరించిన రోజున నరసింహ జయంతిని జరుపుకుంటారు. 2024 మే 21న నృసింహ జయంతిని నిర్వహించేందుకు సంబంధిత ఆలయాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే సాధారణంగా దేవుళ్లు శాంత మూర్తులు. ఎటువంటి ఆపదలనైనా నిర్మలమైన మనస్సుతో పరిష్కరిస్తారు. కాన ఉగ్ర నరసింహుడు మాత్రం ఆగ్రహంతో ఆవిర్భివించాడు. అందుకు కారణం ఏంటి?
అమరత్వం పొందాలనే కోరికతో హిరణ్య కశపుడు బ్రహ్మదేవుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో హిరణ్య కశపుడు ఇంద్రుడి సింహాసనాన్ని సైతం ఆక్రమిస్తాడు. అటు ధర్మబద్ధంగా పాలిస్తున్న దేవత లందరినీ తరిమి కొడతాడు. అత్యంత క్రూరంగా లోకాన్ని పాలిస్తూ దేవదేవుడైన విష్ణువును సైతం ధిక్కరించి, అందరూ తననే దేవుడిగా కొలవాలని ఆదేశిస్తాడు. కొన్ని సొంత పద్ధతులను ప్రవేశపెట్టి సర్వనాశనం చేస్తాడు. అయితే హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు విష్ణువుకు పరమ భక్తుడు. ఐదేళ్ల వయసులోనే మహాభాగవతాన్ని అర్థం చేరుకుంటాడు. ఈ తరుణంలో హిరణ్యకశపుడు తాను విరోధిగా భావించే విష్ణువును తన కుమారుడు సేవించడాన్ని సహించలేక పోతాడు. ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వీడాలని పలు చర్యలు చేపడతాడు.

అయితే హిరణ్యకశపుడు చేసే పనులతో ప్రహ్లాదుడు విష్ణువుపై మరింత భక్తిని పెంపొందించుకోగలుగుతాడు. ఈ పరిణామాలతో పునస్తాపం చెందిన హిరణ్యకశపుడు ప్రహ్లదుడిపై తీవ్రంగా ఆగ్రహిస్తాడు. ఈ సందర్భంగా హిరణ్య కశపుడు మాట్లాడుతూ ‘నన్ను ఎందుకు లెక్క చేయడం లేదు.. నీవు ఎవరి ద్వారా శక్తి పొందుతున్నా’ తెలపాలంటాడు. ‘నా శక్తికి ఆ పరంధాముడే మూలాధారం’ అని ప్రహ్లాదుడు బదులిస్తాడు. ప్రహ్లదుడి మాటలకు మరింత కోపోద్రోక్తుడైన హిరణ్య కశపుడు సింహాసనం నుంచి దిగి ‘సమస్త సృష్టికి అతీతుడై చరచరా జీవులను నియంత్రించే ఆయన ఈ స్తంభంల ఉంటాడా?’అనగా.. ప్రహ్లాదుడు ‘ నిస్సంకోశంగా ఇందులో కూడా ఉంటాడు’ అని చెబుతాడు.

దీంతో హిరణ్య కశపుడు పిడికిలితో స్తంభాన్ని పగలగొడతాడు. ఆ స్తంభం నుంచి నర మృగ శరీరంతో నరసింహావదారుడైన విష్ణువు ఆవిర్భవిస్తాడు. కోపోద్రోక్తుడైన నరసింహ ప్రహ్లాదుడిని చంపేస్తాడు. అయితే భగవంతుడికి సైతం కోపం ఉంటుందా? అని కొందరికి ఆశ్చర్య కలిగించవచ్చు కానీ సర్వం శక్తి అయిన శక్తికి ఒక రూపం ఉందని, ఆ రూపం సమస్త భావాలకు నిలయమని అందరూ తెలుసుకోవాలి. భగవంతుడు కూడా కోపోద్రిక్తుడు కావడానికి క్రూరంగా ప్రవర్తించిన ప్రహ్లాదుడని మట్టికరిపించడానికే అని పురాణం తెలుపుతుంది.