తెలంగాణకు చెందిన నటి గంగవ్వ గురించి యూట్యూబ్ వీక్సకులందరికీ తెలుసు. ఈమె తన కామెడీతో ఆకట్టుకుంటుంది. అంచెలంచెలుగా ఎదిగిన గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అమె చేసిన కొన్ని వీడియోలు పాపులర్ అయ్యాయి. వీటిలో ‘చిలుక పంచాంగం’కు సంబంధించిన ఓ వీడియో మరీ పాపులర్ అయింది. కానీ ఇందులో చిలుకను బంధించి వీడియో తీశారు. దీంతో గౌతమ్ అనే వ్యక్తి పిర్యాదుతో అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు కొందరు కుక్కలను కొట్టడం ద్వారా వారి పైనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వన్యప్రాణి చట్టంలో ఏముంది? జంతువులు, పక్షుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1972లో తీసుకొచ్చారు. ఆ తరువాత దీనిని 1982 నుంచి అనేక సవరణలు చేస్తూ వస్తున్నారు. 2022లో చివరిసారిగా సవరణ చేశారు. 2022 సవరణ ప్రకారం జంతువులను, పక్షులను హింసిస్తే ఈ చట్టం కింద శిక్షతో పాటు జరిమానాలు కూడా కఠినంగా చేశారు. జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా ఉంటాయి. ఏదైనా జంతువును హింసించడం వల్ల ముందుగా రూ.25,000 జరిమానా విధిస్తారు. ఈ నేరం పునరావృతం అయితే జైలు శిక్ష ఉంటుంది. సెక్షన్ 51 ప్రకారం అటవీశాఖ, వన్యప్రాణి క్రైమ్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి ఏజెన్సీల ద్వారా కేసు నమోదు చేస్తారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఎవరైనా జంతువును పెంచుకోవాలంటే అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జంతువుకు ఎటుంటి ఆహారం ఇస్తారో? ఎలా సంరక్షిస్తారో? ముందే అనుమతి పత్రంలో పొందుపర్చాల్సి ఉంటుంది. అనుమతి పొందిన తరువాత కూడా జంతువులను ఏ రకంగా హింసినా వారిని ఈ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల య్యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ చిలుకను బంధించి వీడియో తీయడం వల్ల పక్షులను హింసించిన కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత మరో వీడియో కూడా చేశారు. వీటిపై జరిమానా వేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.