కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియములో ఘనంగా 98వ దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
కరీంనగర్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసి అమరుడైన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు అన్నారు. దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను కరీంనగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కురుమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య మాట్లాడుచూ దొడ్డి కొమురయ్య ప్రస్తుత జనగామ జిల్లా కడివెండి గ్రామంలో 1927వ సంవత్సరం ఏప్రిల్ 3న జన్మించారని అన్నారు. నిరుపేద గొర్రెల కాపరి అయిన ఆయన ఆనాటి భూస్వాముల ఆగడాలకు బానిస బతుకులకు వ్యతిరేకముగా జరిగిన పోరాటంలో ముందుండి ప్రాణాలను సైతం లెక్కచేయకుండ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి తెలంగాణ అమరుడయ్యారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, కురుమ సంఘం జిల్లా నాయకులు కర్రె రాజు, బీర్ల బీరయ్య, ఎల్కపెల్లి లచ్చయ్య, యేగుర్ల అశోక్, జూలపెల్లి రఘునందన్, మేకల నర్సయ్య, చిగుర్ల శ్రీనివాస్, కర్రె అనిల్ కుమార్, కర్రె పావని, పోలె శ్రీనివాస్, సెవ్వాల అక్షయ్, ఈరల్ల విజయ్ కుమార్, దయ్యాల బీరయ్య, కర్రె శ్రీనివాస్, గుంటి స్వరూప మీస రమాదేవి, చిగుర్ల గట్టయ్య వివిధ ప్రజా సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.