నాగుల పంచమి, నాగుల చవితి రోజున మాత్రమే నాగదేవతల గురించి మాట్లాడుకుంటాం. ఏదైనా శివాలయం లేదా ఇతర ఆలయాల్లో మూల విరాట్ కు తోడుగా నాగదేవత విగ్రహాలు ఉంటాయి. కానీ ప్రత్యేకంగా నాగదేవతలకు ఆలయాలు ఉండడం అరుదు. అయితే వందేళ్ల కిందటే నాగదేవత కోసం పెద్ద ఆలయాన్నే నిర్మించారు. ఈ ఆలయంలో నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఆ ఆలయం ఎక్కడో లేదు.. మన హైదరాబాద్ లోనే.. ఆ వివరాల్లోకి వెళ్దామా..
తెలంగాణలో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ లోనూ పురాతన ఆయాలను చూడొచ్చు. వీటిలో తిరుమలగిరి లోని నాగదేవత ఆలయం ప్రముఖంగా కొనసాగుతోంది. స్వయంభూగా వెలిసిన ఈ ఆలయంలో ఎటు చూసినా నాగదేవత విగ్రహాలే కనిపిస్తాయి. ఆలయ చరిత్ర ప్రకారం జయలక్ష్మి అనే మహిళకు కలలో నాగదేవత కనిపించి ఆలయం నిర్మించాలని తెలపగా ఆమె దగ్గరుండి మరీ ఈ ఆలయాన్ని నిర్మించారు.

ప్రతీ పౌర్ణమి రోజున ఈ ఆలయంలో సామూహిక హోమం నిర్వహిస్తారు. ఈ హోమ్లో ఎవరైనా రూ.1000 చెల్లించి పాల్గొనవచ్చు.ఇక్కడ నాగపంచమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతీ సంవత్సరం అజ్వయుజమాసంలో దేవీ నవరాత్రులను నిర్వహిస్తారు.
బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఒక పుట్ట ఉండేది. అయితే దారిలో అడ్డంగా ఉండడం వల్ల దానిని తొలగించారు. దీంతో తిరుగు ప్రయాణంలో వారు ఎక్కడైతే పుట్టను తొలగించారో అక్కడే వీరు ఆకస్మాత్తుగా పడిపోతారు. దీంతో వారు ఇక్కడ నాగదేవత ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. మరో కథ ప్రకారం జయలక్మి అమ్మవారికి చిన్నప్పటి నుంచే నాగ భక్తి ఎక్కువగా ఉండేది.
ఈమెకు పెళ్లి తరువాత నారాయణ స్వామి అనే కుమారుడు జన్మించారు. ఈయన చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక భావాలతో కలిగి ఉంటారు. అయితే ఒకరోజు ఆ బాలుడు ఆకస్మాత్తుగా మరణిస్తాడు. దీంతో జయలక్ష్మీ అమ్మవారు నాగదేవతపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ తరువాత నాగదేవత జయలక్ష్మీ అమ్మవారికి కలలో కనిపించి తన కుమారుడి గురించి బాధపడొద్దని, తన వద్దే ఉన్నాడని చెబుతుంది. అయితే ఇక్కడ తనకు ఆలయం నిర్మించాలని తెలిపింది. అప్పటి నుంచి ఆమె అమ్మవారి గుడి కట్టాలని సంకల్పించుకొని దగ్గరుండి మరీ నిర్మించారు.

ఈ ఆలయంలో నాగదేవత విగ్రహాతలతో పాటు జయలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఈ ఆలయం సికింద్రాబాద్ లోని లాల్ శాస్త్రి నగర్ లోని లాల్ బజార్ సెయింట్ 7వ వార్డులో ఈ ఆలయం ఉంటుంది. తిరుమల గిరి నుంచి ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి వెళ్లొచ్చు.