Wednesday, June 25, 2025

స్కూల్లో చదవడానికి డబ్బులు లేక.. రోహిత్ శర్మ ఏం చేశాడో తెలుసా?

భారత కెప్టెన్, టీ20 వరల్డ్ కప్ రెండోసారి విజయం సాధించడానికి కారణమైన రోహిత్ శర్మ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ తరువాత ఓ వైపు క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటుండగా రోహిత్ శర్మ ఊహించని విధంగా తాను టీ 20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికే విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత అందరూ చర్చిస్తుండగా.. ఆ వెంటనే రోహిత్ శర్మ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. టీ 20 కెరీర్ లో మొత్తం 124 మ్యాచులు ఆడిన ఆయన 3,308 పరుగులు చేశాడు. ఇందులో బ్యాటింగ్ రేటు సగటు 32.75 గా ఉంది. 2015 అక్టోబర్ 2న భారత్ లో జరిగిన దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచ్ తో మొదటిసారి టీ 20 మ్యాచ్ ఆడాడు. ఇందులో ఆయన 100 పరుగులు చేసి గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఇదే సౌతాఫ్రికాతో చివరి మ్యాచ్ ఆడడం విశేషం. ఈ సందర్భంగా రోహిత్ శర్మ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తి చర్చ సాగుతోంది.

రోహిత్ శర్మ 1987 ఏర్పిల్ 30న మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జన్మించారు. రోహిత్ తల్లి పూర్ణిమాది విశాఖ పట్టణం. తండ్రి గురునాథ్ ఓ రవాణా సంస్థ స్టోర్ హౌస్ లో కేర్ టేకర్ గా పనిచేసేవాడు. అయితే ఇతని ఆదాయం తక్కువగా ఉండడంతో రోహిత్ శర్మను తన తాత, పినతండ్రులు పెంచారు. రోహిత్ శర్మకు ఒక తమ్ముడు ఉన్నారు. ఆయన పేరు విశాల్ శర్మ. అయితే ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు 1999లో క్రికెట్ క్యాంపులో చేరాడు. అయితే అతని కోచ్ స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ లో చేరమని సలహా ఇచ్చాడు. కానీ ఇందులో చదవడానికి డబ్బులు లేవని చెప్పాడు.

దీంతో కోచ్ ఇచ్చిన ఉపకారవేతనంతో నాలుగు సంవత్సరాల పాటు ఈ స్కూల్ లో చదివాడు. ఆ తరువాత క్రికెట్ లో రాణించిన రోహిత్ శర్మ ఆఫ్ స్పిన్నర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఇతని సామర్థ్యాన్ని గమనించి ఏ టోర్నీలో అయినా అతడిని ఓపెనర్ గా దించారు. దీంతో అతడు సెంచరీ కొట్టేవాడు. ఈ క్రమంలో 2005లో దేవధర్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్ తరుపున ఆడిన రోహిత్ 123 బంతుల్లో 142 పరుగులు చేశాడు. ఆ తరువాత 2007 నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో ఐర్లాండ్ తో మొదటి మ్యాచ్ ఆడి కెరీర్ ను ప్రారంభించాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News