Thursday, June 26, 2025

రాముడు వనవాసానికి వెళ్లాడు.. నేడు భరతుడిని మాత్రమే: అతిశీ

ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని పొందడం అంటే ఆషామాషీ కాదు.. ప్రాణాలకు తెగించి పోరాడితే గానీ అలాంటి అవకాశం రాదు.. కొందరు ఈ పీటంపై కూర్చోడానికి చేయరాని పనులు చేస్తుంటారు. ఎలాగైనా ఆ సీట్లో ఒక్కరోజైనా కూర్చోవాలని తహతహలాడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎందరో రాజకీయ నాయకులు సీఎం పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతారు. అయితే ఒక్కోసారి ఈ పదవిని ఇతరులకు త్యాగం చేయాల్సి వస్తుంది. ఢిల్లీలో మూడుసార్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్ తన సీటును ఇటీవలే ఆ పార్టీకి చెందిన అతిశీకి అప్పజెప్పారు. కొన్ని రోజుల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటారని స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అయితే సీఎం సీట్లో కూర్చొన అతిశీ తన పక్కన మరో కుర్చీ వేశారు. ఎందుకంటే?

ఆప్ ప్రభుత్వంతో మంత్రిగా కొనసాగిన అతిశీ సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆప్ మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజర్యారు. అయితే ముందస్తుగా ఎన్నికల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలు వచ్చే వరకు అతిశీ సీఎంగా ఉంటారని అన్నారు. దేశంలో అతిచిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా, ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రిగా అతిశీ వార్తల్లోకి ఎక్కారు. దీంతో ఆమె గురించి దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

ఈ తరుణంలోనే అతిశీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను కూర్చునే సీఎం సీటు పక్కన మరో కుర్చీ వేశారు. దీనిపై కొందరు మీడియా ప్రతినిధులు అడగగా.. ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. ఆ కుర్చీ సీఎం కేజ్రీవాల్ ది అని చెప్పారు. ‘రామాయణంలో రాముడు పాదరక్షలు సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు పాలించాడు’ అలాగే ఆకుర్చీ కేజ్రీవాల్ దేనని తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే అన్నారు. అంతేకాకుండా కేజ్రీవాల్ సీఎం అయ్యేవరకు ఆ కుర్చీ ఖాళీగానే ఉంటుందని చెప్పారు.

అయితే అతిశీ ఇలా చేయడంపై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతున్నారా అని అంటున్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 26 లేదా 27వతేదీ రోజున ఆమె బలనిరూపణ చేసుకోనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News