భారతదేశంలో ప్రకృతి సంపదకు కొదువ లేదు. అడవులు, నదులతో పాటు రకరకాల జంతువులు ఉన్నాయి. దేశానికి మూడు వైపుల సముద్రాలు ఉన్నాయి. ఈ క్రమంలో హిమాలయాలలతో పాటు వివిధ ప్రాంతాల్లో జన్మించిన జలధార నదుల ద్వారా ఈ సముద్రాల్లో కలుస్తుంది. నదులు ప్రవహించే మార్గంలో కొండలు, కొనలు వస్తాయి. వీటి నుంచి నీరు కిందికి దూకాల్సి వస్తుంది. ఇలంటి ప్రదేశాన్ని జలపాతం అంటారు. ఈ జలపాదం చూడడానికి అందంగా ఉంటుంది. దేశంలోనే అనేక రకాల జలపాతాలు ఉన్నాయి. అయితే ఇటీవల కుట్రాలం జలపాతం పేరు బాగా వినిపిస్తోంది. ఈ జలపాతానికి ఒక్కసారిగా వరద రావడంతో ఓ బాలుడు తప్పిపోయాడు. దీంతో ఈ జలపాతం ఎక్కడుంది? దాని గురించి వివరాలు తెలుసుకోవాలన్న ఆశ అందరికి కలుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

తమిళనాడు రాష్ట్రంలో కుట్రాలం జలపాతం చూడొచ్చు. ఈ రాష్ట్రంలోని తెన్ కాసి జిల్లాలోని కుట్రాలంలో ఈ జలపాతం ఉంది. పశ్చిమ కనుమలలో ప్రవహిస్తున్న ఈ నీరు భారీ ఎత్తు నుంచి కిందికి పడడం చూస్తే మనసు ఉల్లాసంగా మారుతుంది. కుట్రాలం జలపాతానికి ఎక్కువగా జూలై నుంచి జనవరి వరకు సందర్శకులు వస్తుంటారు. అయితే వర్షాలు ఎక్కువగా ఉంటే పర్యాటకులను అనుమతించరు. ఎందుకంటే 500 మీటర్ల ఎత్తు నుంచి వచ్చే ఈ నీరు బలంగా పారుతుంది. దీంతో ఆ నీటి తట్టుకునే శక్తి ఉండదు.
కుట్రాలం జలపాతాన్ని చూడాలంటే రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా వెళ్లొచ్చు.
- బస్సు ద్వారా మధురై నుంచి వెళ్లాలంటే 160 కిలోమీటర్లు, శివకాశి నుంచి 105 కిలోమీటర్లు, టుటికోరిన్ నుంచి 86 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే మధురై నుంచి నేరుగా కర్తాళం చేరుకోవడానికి బస్సులు అందుబాటులో ఉంటాయి.
- రైలు మార్గం ద్వారా చెన్నై నుంచి తిరునెల్వెలి జంక్షన్ కు వెళ్లొచ్చు. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా తెన్ కాశికి వెళ్లొచ్చు.
- చెన్నై నుంచి టుటికోరిన్ కు విమానం ద్వారా వెళ్లొచ్చు.

తెన్ కాసి జిల్లాలో కుట్రాలం జలపాతం మాత్రమే కాకుండా ఇక్కడున్న సెంగొట్టై, పాన్ఫోలిన్ లో ఓ కొండ ఉంది. దీనిపై సుబ్రహ్మహణ్య స్వామి పురాతన ఆలయం ఉంది. ఆహారం కోసం తెన్ కాసిలో పుష్కలంగా హోటళ్లు ఉంటాయి. ఇక్కడ బోర్డర్ పరోటా స్టార్ చాలా ఫేమస్. ఇందులో ఫుడ్ బాగుంటుందని చాలా మంది చెబుతున్నారు. ఇక్కడ ఏ ఫుడ్ కావాలన్న క్యూలో నిల్చోవాల్సిందే. ముఖ్యంగా బిర్యానీ కోసం లొట్టలేసుకుంటారు.