Tuesday, June 24, 2025

కొబ్బరి బొండాం నీళ్లు వీరు తాగొచ్చా?

ప్రకృతి ప్రసాదించే కొన్ని రకాల పండ్లు, కాయలతో నిత్యం ఆరోగ్యంగా ఉంటారు. కానీ నేటి కాలంలో చాలామంది వీటిని పక్కన ఉంచి రసాయనాలు కలిపిన వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. నాచురల్ గా లభించే కొబ్బరి బొండంలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. అంతేకాకుండా వేసవికాలంలో కొబ్బరిబొండం తాగడం వల్ల బాడీ డిహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. అయితే అన్నం కూడా కొందరికి విషంగా మారినట్లు.. కొబ్బరి బొండం నీళ్లు కొందరికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వీరికి కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకీ ఎవరు కొబ్బరినీళ్లు తక్కువగా తాగాలి?

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. కానీ మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరినీళ్లు తక్కువగా తాగాలి. కొబ్బరిబొండంలో అధిక పొటాషియం ఉండడంతో.. వీరిలో తొందరగా ఫిల్టర్ కాలేవు. వీటితో గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దీంతో ఒక్కోసారి గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. కండరాల బలహీనత ఉన్నవారు సైతం కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండటమే మంచిది.

ఒక నిర్దిష్ట వయసు దాటిన తర్వాత కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఎలక్ట్రోల్ లైట్లు వృద్ధులకు నష్టాన్ని చేకూరుస్తాయి. ఇవి అధిక శక్తిని ఉండడంవల్ల వారి గుండెపై తీవ్రంగా ప్రభావం పడుతుంది.

మధుమేహం ఉన్నవారు కొబ్బరి నీళ్లను తక్కువగా తీసుకోవాలని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినీళ్లలో చక్కెర స్థాయి నిలువలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపుతప్పుతాయి. ఒకవేళ అత్యవసరంగా కొబ్బరి నీళ్ళు తీసుకోవాల్సి వస్తే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

అధిక రక్తపోటు ఉన్నవారు కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిదే. కానీ లో బీపీ ఉన్నవారు మాత్రం వీటిని దూరం పెట్టాలి. కొబ్బరి నీళ్లతో కొందరికి చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటిని ఎక్కువ తాగడం వల్ల శ్వాస ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News