Tuesday, June 24, 2025

Berappa Siddappa: సివిల్స్ లో ర్యాంక్ కొట్టిన గొర్ల కాపరి కొడుకు..

టాలెంట్ ఎవరు సొత్తు కాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ చాలామంది తమ ప్రతిభ గురించి తెలియక ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం అనుకున్నది సాధించడానికి తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. మరికొందరికి జీవితంలో గెలవాలని ఎంతో ఆరాటం ఉన్న కొన్ని పరిస్థితులు అడ్డంకుగా నిలుస్తూ ఉంటాయి.. అయినా సరే వాటిని ఛేదించుకుంటూ ముందుకు వెళ్లి విజేతగా నిలుస్తారు. అలా ఓ గొర్రెల కాపరి కొడుకు తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ముందుకు వెళ్లి సివిల్స్ లో ర్యాంకు సాధించాడు. ఆల్ ఇండియా లెవెల్ లో 551 వా ర్యాంకు సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. అయితే ఒక గొర్రెల కాపరి కొడుకు గోర్లు మాత్రమే కాస్తాడు.. అని పూర్వకాలంలో అనుకునేవారు.. కానీ ఇప్పుడు కష్టపడితే విజయం ఎవరికైనా సొంతంగా మారుతుందని ఆ గొర్ల కాపరి కొడుకు నిరూపించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?

ఇటీవల యూపీఎస్సీ ఫలితాల్లో మహారాష్ట్ర కు చెందిన ఆమ్గే గ్రామంలోని బీరప్ప సిద్ధప్ప డోనీ అనే యువకుడు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి 2024లో ఉత్తీర్ణత సాధించాడు. అయితే ఈ యువకుడు తన ఒక్క డి విజయం మాత్రమే కాదు ఆ గ్రామంలోని అందరిదీ అని అంటున్నారు. ఎందుకంటే దాదాపు వారి బంధువులు, చుట్టాలు గొర్లు కాసుకుంటూ జీవనోపాధిని పొందేవారు. అలాంటి తమ కుటుంబంలో ఒక బిడ్డ ఐపిఎస్ అధికారి కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇందులో భాగంగా వీరి సామాజిక వర్గానికి చెందిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వయంగా వీరికి ఫోన్ చేసి అభినందించడం విశేషం.

బీరప్ప సిద్ధప్ప తండ్రి సిద్ధప్ప.. తల్లి బాలవ్వ.. వీరి కులదేవత భీరయ్య. అయితే చిన్నప్పటి నుంచి చదువులో ఉత్సాహంగా ఉండడంతో అతని ప్రోత్సహించేవారు. దీంతో అతడు ఇంజనీరింగ్ పూర్తి చేసి బీటెక్ డిగ్రీ పొందాడు. కాగా అప్పటికే తన అన్నయ్య భారత సైన్యంలో అధికారిగా ఉన్నాడు. అయితే ఆ అధికారిగా కావాలని అనుకున్న అతడు తన కళ నెరవేర్చుకోలేకపోయాడు. దీంతో సివిల్స్ రాయాలని అనుకున్నాడు.

ఈ క్రమంలో కొన్ని రోజులపాటు డబ్బు కోసం ఇండియా పోస్టులో కూడా పనిచేశాడు. ఆ తర్వాత పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టి యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యాడు. మొదటి, రెండు ప్రయత్నాల్లో విఫలమైన బీరప్ప సిద్ధప్ప పట్టు వదలకుండా మళ్లీ చదవాడు. దీంతో మూడో ప్రయత్నంలో 551 ర్యాంకుతో సివిల్స్ లో విజేతగా నిలిచాడు. ఈ ర్యాంకుతో అతడు ఐపీఎస్ అధికారి కాబోతున్నాడు. ఈ ర్యాంకు సాధించి అతడు తన సామాజిక వర్గానికే గుర్తింపు తెచ్చాడని గ్రామస్తులు అంటున్నారు.

అలాగే కర్ణాటక సరిహద్దులోని బెలగావిలోని కోటి వాడుకు చెందిన మరో గొర్రెల కాపరి కుమారుడు హనుమంతప్ప ఎల్లప్ప నంది కూడా సివిల్స్ లో 910 ర్యాంకు తెచ్చుకున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News