బంగ్లాదేశ్ లో ఉద్యోగాల్లో చేపట్లే రిజర్వేషన్లపై మొదలైన నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఈ అల్లర్లలో 100 మందికి పైగా మరణించారు. దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి వెంటనే ఇండియాకు వచ్చారు. వాస్తవానికి ఆమె లండన్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ముందుగా ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్నట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో షేక్ హసీనా భారత్ కు రావడానికి కారణం ఏంటి? లండన్ ఎప్పుడు వెళ్తారు?
బంగ్లాదేశ్ లో ప్రత్యేక దేశం ఏర్పడిన సమయంలో కొందరు మరణించారు. వీరిని బంగ్లా విముక్తి పోరాట యోధులుగా పేర్కొంటారు. అయితే ఉద్యోగాల్లో వీరి పిల్లలకు ఒక వంతుగా రిజర్వేషన్లు కేటాయించారు. దీనిపై 2018లోనే నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అయితే దీనిపై ఈ ఏడాది జూన్ లో హైకోర్టు ఆ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఆందోళనలు మొదలయ్యాయి. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీం కోర్టు సైతం వ్యతిరేకించింది. అయినా ఆందోళనలు సాగడం లేదు.
పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చారు. అయితే బంగ్లా దేశ్ కు , భారత్ కు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. భారత్ కు వ్యతిరేకంగా పనిచేసే కొన్ని ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ లో ఉండడంతో వారిపై షేక్ హసీనా చర్యలు తీసుకున్నారు. అలాగే భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ కు ఉన్న సరిహద్దు సమస్యలు షేక్ హసీనా కాలంలో పరిష్కారం అయ్యాయి. భారత్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు రవాణా చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదీ కాకుండా 1971 లో బంగ్లా ఏర్పడిన సమయంలో భారత్ మద్దతుగా ఉంది. అందువల్ల భారత్ సురక్షిత ప్రదేశంగా భావించారు. దీంతో ఆమె ఇండియాకు వచ్చారు.
అయితే షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కాని బ్రిటన్ ప్రభుత్వం నుంచి రాజకీయ ఆశ్రయం పొందేందుకు ఆమెకు అనుమతి రాలేదు. అక్కడి నుంచి అనుమతి రాగానే షేక్ హసీనా లండన్ వెళ్లనున్నారు.