Wednesday, June 25, 2025

Bandi Sanjay: కేసీఆర్ రికార్డును అధిగమించిన బండి సంజయ్

Bandi Sanjay:కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బండి సంజయ్ భారీ మెజారిటీతో రెండోసారి గెలుపొందారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2006 ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు 2,01,581 లక్షల మెజారిటీ వచ్చింది. ఆ తరువాత 2014లో వినోద్ కుమార్కు 2,05, 007 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు బండి సంజయ్ కి అంతకంటే ఎక్కువగా2,25,209 ఓట్లమెజారిటీ రావడంతో వీరి రికార్డును అధిగమించారు. 2019 ఎన్నికల్లో 89, 508 ఓట్లమెజారిటీతో గెలుపొందారు. అంటే గత ఐదేళ్లలో బండి సంజయ్ హవా రెట్టింపయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కరీంనగర్ బీఆర్ఎస్ ను ఆదరిస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ ఆ పార్టీ అభ్యర్తి వినోద్ కుమార్ మూడో స్థానానికే పరిమితం అయ్యారు. దీంతో ఇక కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది అయితే కరీంనగర్, హుజూరాబాలో ఎమ్మెల్యేలుగా ఉన్న గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డిలు పార్టీని ఎలా గాడిలో పెడతారో చూడాలి.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News