ఆషాఢం మాసం ముగిసి శ్రావణ మాసం సమీపిస్తున్న వేళ.. బంగారం ధరలు గుడ్ న్యూస్ చెప్పాయి. అంతకుముందు వారం రోజుల పాటు రూ.5 వేల తగ్గిన బంగారం ధరలు ఆ తరువాత పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయి. బులియన్ మార్కెట్ ప్రకారం.. ఆదివారం బంగారం ధరలు తగ్గాయి. వెండి మాత్రం భారీ స్థాయిలో దిగి వచ్చింది. దీంతో నిన్నటి వరకు బంగారం డౌన్ కాగా.. ఇక వెండి వంతు అన్నట్లుగా మారింది. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఇండియన్ బులియన్ మార్కెట్ ప్రకారం హైదరాబాద్ లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700 ఉంది. నిన్న ఈ బంగారం రూ. 64,800 తో విక్రయించారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,580 వద్ద కొనసాగుతోంది. ఇది నిన్న రూ.70,690తో విక్రయించారు. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,730తో విక్రయిస్తున్నారు. అంటే ఢిల్లీతో పోల్చుకుంటే హైదరాబాద్ లోనే బంగారం ధరలు తగ్గాయని చెప్పవచ్చు.
ఇక నిన్నటి వరకు బంగారం ధరలు భారీగా తగ్గగా ఇప్పుడు వెండి వంతు అయింది. ఆదివారం సిల్వర్ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ.90,900తో విక్రయిస్తున్నారు. శనివారంతో పోల్చుకుంటే వెండి రూ. 1700 తగ్గింది. ఇవే ధరలు ఢిల్లీలో రూ.85,500 ఉన్నాయి. దీంతో వెండి తగ్గడంతో చాలా మంది సిల్వర్ ను కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
ఆషాఢం మాసం పూర్తయి శ్రావణం సమీపిస్తున్న వేళ బంగారం, వెండి ధరలు తగ్గడంతో కొనుగోలుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటి నుంచి పండగల సీజన్ ఉండనుంది. దీంతో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. పూజలకు ఉపయోగించే పాత్రలు వెండివి ఉండడం వల్ల మంచిది అని కొందరి అభిప్రాయం. దీంతో చాలా మంది వెండి వస్తువులు అదీ శ్రావణమాసంలో కొనుగోలు చేయాలని చూస్తారు. ఇలాంటి సమయంలో వీటి ధరలు తగ్గడంతో మరింత ఎక్కువగా పసిడితో పాటు వెండిని కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే శ్రావణ మాసంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..