Wednesday, June 25, 2025

మహిళలకు అలర్ట్.. భారీ వడ్డీ వచ్చే ఈ పథకం 31తో క్లోజ్..

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. వారి ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా తీసుకొచ్చిన ఇప్పటికే కొన్ని పథకాలు వారికి భరోసా ఇచ్చాయి. అయితే మహిళల్లో పొదుపు పెంచుతూ వారి డబ్బుకు రెట్టింపు చేసేలా కొన్ని స్కీం లను ప్రవేశపెట్టింది. వీటిలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒకటి. దీనిని 2023 మార్చి 31న కేంద్ర ప్రభుత్వం అమృత్ మహోత్సవం కింద ప్రారంభించింది. ఇందులో మహిళలు పెట్టుబడులు పెడితే వాటికి మిగతా వాటికంటే ఎక్కువ వడ్డీని ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుంది. అయితే ఈ పథకం మార్చి 31, 2005న ముగియనుంది. ఈలోపు మహిళలు పెట్టుబడులు పెడితే వాటికి అధిక వడ్డీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎంతవరకు పెట్టుబడులు పెట్టొచ్చు? ఆ వివరాల్లోకి వెళితే..

దేశంలోని మహిళలందరూ ఈ పెట్టుబడులకు అర్హులే. మైనర్ బాలికలు అయితే వారి సంరక్షకులు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఇది రెండేళ్ల పాటు డిపాజిట్ చేసుకుని అవకాశం ఉంటుంది. ఇందులో డిపాజిట్ చేయడం వల్ల 7.5 వార్షిక వడ్డీని అందిస్తున్నారు. ప్రతినెల కొంత మొత్తం జమ చేయడంతో పాటు ఒకేసారి కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కనీసం రూ ₹1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇందులో పొదుపు చేయవచ్చు. ఇలా చేస్తే రూ. 2 లక్షల పై మొదటి ఏడాది 15 వేల వడ్డీ పొందవచ్చు. రెండో సంవత్సరంలో రూ. 16,125 వడ్డీ వస్తుంది. మొత్తంగా రెండు లక్షలకు రెండు సంవత్సరాలకు రూము 31,125 వడ్డీని చెల్లిస్తారు.

అయితే ఇందులో ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత రెండు సంవత్సరాల వరకు తీసుకోకుండా ఉంటే పైన చెప్పిన విధంగా వడ్డీ వస్తుంది. ఒకవేళ అత్యవసర సమయంలో ఈ మొత్తాన్ని తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఆ సమయంలో 40 శాతం మినహాయించుకొని మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్న వారు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించవచ్చు. మిగతా వాటి కంటే ఇందులో వచ్చే వడ్డీ ఎక్కువగా ఉన్నందున ఇది మహిళలకు ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే ఈ స్కీంను మార్చి 31న పిలిపివేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News