ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఒక్కచోట చదువుకున్న వారు.. ఆ తరువాత ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారులు చేస్తున్నారు. కానీ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా వీరంతా మళ్లీ ఒక్కచోటుకు చేరి ఉల్లాసమైన వాతావరణంలో గడుపుతున్నారు. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’.. అంటారు. ఆ పాత మధురాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎంతో హాయినిస్తాయి. అలాగే పాత స్నేహితులను కలిస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అందుకే చాలా మంది తమ స్కూల్ సంగతులు.. కాలేజీ విశేషాలు.. నెమరేసుకునేందుకు ఈ మధ్య ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

తాజాగా కరీంనగర్ లోని కూమార్వాడీ యూపీఎస్ స్కూల్ లో 1997-1998 సంవత్సరంలో చదువున్న విద్యార్థులు 27 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. అప్పటి విద్యార్థినీ విద్యార్థులతో పాటు ఆ కాలంలో చదువు నేర్పిన గురువులు ఒక్కచోటుకు చేరారు. కరీంనగర్ లోని శ్వేత హోటల్ లో అక్టోబర్ 6న జరిగిన ఈ ఈవెంట్లో అంతా కలుసుకుని ఆ పాత మధురాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నకిరెకొమ్ముల శ్రీనాథ్, పింగిలి కరుణాకర్ రెడ్డి, మాడిశెట్టి రాజశేఖర్, ముప్పిడి సంపత్ కుమార్, అక్కు శ్రీనివాస్, శ్రీరాముల సురేష్, విజయ్, లవణ్ కుమార్, రాజు, గణేశ్, సురేష్ లతో పాటు ఉపాధ్యాయులు రాధాస్వామి, భారతి, రామ చందర్, రవీందర్, సత్తయ్య లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్ గా మాడిశెట్టి రాజశేఖర్, నకిరెకొమ్మల శ్రీనాథ్ వ్యవహరించారు.
