వరద విలయంలో తెలుగు రాష్ట్రాలు చిక్కుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ ప్రాంతాల్లో వరద తాకిడికి నీట మునిగాయి. వర్షం తగ్గినా.. కొన్ని ప్రాంతాలు నీటిలోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నీటిలో చిక్కుకున్న బాధితులకు ఆహారం, నీరు అందించేందుకు ఆయా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులను పరామర్శిస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నారు. అయితే నీట మునిగిన కొన్ని ప్రాంతాలకు బోట్ లు వెళ్లలేని పరిస్థితి. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం డ్రోన్లను ఉపయోగించుకుంటుంది. వీటి ద్వారా బాధితులకు కావాల్సిన సాయం చేస్తుంది. అయితే ఈ డ్రోన్లను ఎవరు కనుగొన్నారు? ఇవి ఎలా పనిచేస్తాయి.

ఏపీలోని విజయవాడ కలెక్టరేట్ నుంచి మంగళవారం ఎక్కువగా డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహార సరుకులు అందించారు. మొత్తం 16 డ్రోన్లను ఉపయోగించి పాల ప్యాకెట్లు, బ్రెడ్లు, వాటర్ బాటిళ్లు, కూరగాయలు అందజేశారు. డ్రోన్లను 1970లో అబ్రహం కరేమ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. UAV టెక్నాలజీని ఉపయోగించి రియోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే విధంగా తయారు చేశారు. డ్రోన్లు అల్ట్రాసోనిక్, లేజర్ లేదా లిడార్ డిస్టెన్స్ సెన్సార్స్, టైమ్ ఆప్ ప్లైట్ సెన్సార్ లు ఉంటాయి. స్టెబిలైజేషన్ తో పాటు ఓరియంటేషన్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. విజువల్ సెన్సార్లను కూడా అమర్చడంతో వీడియో డేటాను అందిస్తాయి. వీటిలో నికెల్ కాడ్మియం, లిథియం పాలిమర్, లిథియం అయాన్ వంటివి ఉపయోగించి బ్యాటరీని తయారు చేస్తారు.
సాధారణంగా పెళ్లిల్లో ఉపయోగించే డ్రోన్లు కేవలం ఫోటోలు, వీడియోలు మాత్రమే తీస్తుంది. కానీ విమానాల వలె ఉండే డ్రోన్లలో ప్రొఫెల్లర్ల ద్వారా అది పైకి లేస్తుంది. అంతేకాకుండా బరువైన వస్తువులను తీసుకెళ్లగలుగుతుంది. వీటి రెక్కలకు రోటర్ లకు బదులుగా లిప్ట్ ను అమరుస్తారు. దానిని ఆపరేటర్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఉపయోగిస్తారు. డ్రాన్లు రాత్రి పూట కూడా పనిచేస్తాయి. వీటికి శక్తివంతమైన ఎల్ ఈడీ స్ట్రోబ్ లను అమరుస్తారు. ఇవి క్రమ పద్ధతిలో కాంతిని విడుదల చేస్తాయి.

ఒక్కో డ్రోన్ 10 నుంచి 30 నిమిషాల పాటు గాలిలో ఎగురుతుంది. అయితే వాటిలో అమర్చే బ్యాటరీని బట్టి సమయం పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే అతిపెద్ద డ్రోన్ 6 నుంచి 8 గంటల వరకు గాలిలో ఉండే అవకాశం ఉంది. విజయవాడలో ఉపయోగించిన డ్రోన్లు ఒక్కోటి 10 కిలోల బరువు మోస్తాయి. అయియితే కొన్ని డ్రోన్లు 25 కిలోల పేలుడు పదార్థాలను కూడా తీసుకెళ్తాయి. ఒక్కో డ్రోన్ 16 నుంచి 48 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి. వీటిలో రేసింగ్ డ్రోన్లు 70 కిలోమీటర్ల స్పీడ్ తో పనిచేస్తాయి. డ్రోన్లు పూర్తిగా ఛార్జింగ్ కావడానికి 3 గంటలు పడుతుంది. కొన్ని డ్రోన్లు 30 హార్స్ పవర్ తో వాంకెల్ ఇంజిన్ తో పనిచేస్తాయి. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ప్రస్తుతం డ్రోన్లు వరద సాయంలో ఎంతో ఉపయోగపడ్డాయి. మరికొన్ని సేవలకు కూడా వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది.