తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి ప్రపంచం పలుసార్లు మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అనేక ప్రత్యకతలు ఉంటాయి. హైదరాబాద్ బిర్యానీ గురించి మొదలు పెడితే ఇక్కడ నివాసం ఉండడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయని నివేదికలు వచ్చాయి. అయితే నివాసానికి అనుగుణంగా ఉన్న హైదరాబాద్ భవన నిర్మాణాల్లో దూసుకుపోతోంది. ఇక్కడ ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడి ఎత్తైన భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైటెక్ సిటీ, కోకా పేట ప్రాంతాల్లోకి వెళితే అమెరికా లేదా ఇతర దేశాల్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లోని అత్యంత ఎత్తైన భవన నిర్మాణం పూర్తయింది. ఈ భవనం 57 అంతస్థులు కావడం విశేషం. దీని విశేషాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని కోకాపేటలో సాస్ క్రౌన్ పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం నగరానికి ల్యాండ్ మార్క్ గా కానుంది. హైదరాబాద్ లోని రింగ్ రోడ్డు పక్కన 4.5 ఎకరాల్లో దీనిని నిర్మించారు. దీని ఎత్తు 228 మీటర్లు. ఒక్కో అంతస్థులో ఒక్కో అపార్ట్ మెంట్ మాత్రమే ఉంటుంది. మొత్త 5 టవర్లలో దీనిని నిర్మించారు. ఇందులోని ఒక్కో అపార్ట్ మెంట్ 6,565 చదరపు అడుగులుగా ఉంది. డూప్లెక్స్ అపార్ట్ మెంట్ 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కాగా ఇందులోని 6,565 చదరపు అడుగుల ప్లాట్ కు రూ.8.81 కోట్లు ధర ఉన్నట్లు గతంలో తెలిపారు. అయితే ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయో తెలియాల్సి ఉంది. స్విమ్మింగ్ ఫూల్ తో పాటు అన్నీ ఆధునిక హంగులు కలిగి ఉన్నాయి. అలాగే ఇందులో మల్టీ ఫంక్షన్ హాల్ ను నిర్మించారు.
దీని పైన నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం వ్యూ కనిపిస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో 62 అంతస్థుల భవనం కూడా నిర్మితం కాబోతుంది. ఇప్పటికే హైదరాబాద్ మొత్త భవన నిర్మాణాలతో కనిపిస్తోంది. ఇప్పటి వరకు అతి పెద్ద భవనాలు అంటే దుబాయ్ లోని బుర్జ్ ఖలీపా గురించి మాత్రమే చర్చించుకునేవారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో నిర్మించే ఈ భవనం దక్షిణాసియాలోనే హైలెట్ గా నిలవనుంది.
ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అతిపెద్ద భవనం ఆస్ట్రియా రాజధానిలోని వయన్నాలో ఉంది. దీనికి ‘కార్ల్ మార్క్స్ హాప్’ అనే పేరు పెట్టారు. ఇది ఏకంగా 1100 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 1300లకు పైగా అపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఇందులో 5 వేల కుటుంబాలు నివసిస్తాయి.