Tuesday, June 24, 2025

UPI చెల్లింపులు రూ.5 లక్షలకు పెంపు..ఇలా చేస్తే ఛార్జీలు వర్తిస్తాయి..

ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ద్వారానే మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. వస్తువుల కొనుగోలు నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పంపించేందుకు ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ వాడుతున్నారు. అయితే ఈ యాప్ లు Unified Payments Interface (UPI) ద్వారా మనీని కావాల్సిన వారికి ట్రాన్స్ ఫర్ చేస్తాయి.ప్రస్తుతం భారతదేశంలో 350 మిలియన్ల మంది వినియోగదారులు యూపీఐకి కనెక్ట్ అయి ఉన్నారు. దాదాపు ప్రతి రోజూ 1.344 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కోక్కరు రూ. లక్ష రూపాయల వరకు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రూ. 5 లక్షల పరిమితి వరకు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు..అయితే ఇలా చేస్తే మాత్రం ఛార్జీలు పడుతాయి.. అదేలాగంటే?

మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అక్టోబర్ నుంచి కొన్నిమార్పులు చేయనుంది. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ. 5 లక్షల వరకు పంపించుకునే అవకాశాన్ని కల్పించనుంది. అయితే ఇది అందరికీ కాదు. ఆదాయపు పన్ను, ఆసుపత్రి, విద్యాసంస్థలు, ప్రభుత్వ సెక్యూరిటీ కొనుగోలుకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా చెల్లింపులు కేవలం లక్ష వరకు మాత్రమే పరమితి ఉన్నట్లు నేషనల్ పేమేంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తెలిపింది.

ఆసుపత్రి, విద్యాసంస్థలు తదితర చెల్లింపులు అత్యవసరం అయినందున వీటి పరిమితి పెంచినట్లు తెలుస్తోంది. ఈ చెల్లింపులు రూ. 5 లక్షల వరకు ఉంటే ఎలాంటి అదనపు ఛార్జీలు వేయరు. అయితే ఈ చెల్లింపులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తే మాత్రం అదనపు చార్జీలు ఉంటాయి. వాస్తవానికి 2023 డిసెంబర్ లోనే యూపీఐ చెల్లింపులను రూ.5 లక్షలకు పెంచారు. కానీ ఆ సమయంలో కేవలం పన్ను చెల్లించడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆసుపత్రి, విద్యాసంస్థల బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఇస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News