ఎమోషన్.. ప్రేమ.. ఆప్యాయత.. నవ్వించడం.. ఆడడం.. పాడడం.. ఇలా నవరసాలు కలిగి ఉంటేనే ఆనాడు నాటక రంగంలో రాణించేవారు. కానీ సినిమాల్లో రాణించాలన్నా ఈ ప్రత్యేకతలు ఉండాల్సిందే. అయితే ఇలాంటి నవరసాలు కొంత మందిలో మాత్రమే కనిపిస్తాయి. అలనాటి దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు లో మాత్రమే ఇవి కనిపించాయి.. ఆ తరువాత ఆయన వారసుడిగా ఎవరు ఆయన పేరు నిలబెడుతారు? అనే చర్చ వచ్చిన సందర్భంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆప్పటి నుంచి ఇప్పటి వరకు అశేష సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ‘లెజండ్’ యాక్టర్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సినీ ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తవుతుంది.
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు వస్తారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ కావాలంటే సొంత ప్రతిభ ఉండాలి. నటనలో జీవించాలి.. అన్నీ కలిపి నవరసాలు పండించాలి.. అయితే ఆయన కుమారుడైన బాలకృష్ణ అప్పటికీ, ఇప్పటికీ ‘లెజెండ్’ యాక్టర్ అనిపించుకుంటున్నాడు.
1974లో ‘తాతమ్మ కల’ సినిమాతో బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేశారు.ఈ సినిమా సమయంలో బాలయ్య కుర్రాడే. కానీ అప్పటికే సినీ ఇండస్ట్రీ కుటుంబం కనుగ ఆయనకు ఓనమాలు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో మొదటి సినిమాలోనే కెమెరా ఫియర్ లేకుండా నటించారు. ఆ తరువాత వరుసగా ఎక్కడా ఆగకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే 1984లో ‘సాహసమే జీవితం’ అనే సినిమాతో హీరోగా మొదటి సినిమా చేశాడు. ఆ తరువాత మంగమ్మ గారి మనువడు, అపూర్వ సోదరుడు, మువ్వ గోపాలుడు వంటి సినిమాలు ఆయన కెరీర్ ను మలుపు తిప్పాయి.
ఇలా మొత్తం ఇప్పటి వరకు 108 సినిమాల్లో నటించిన బాలకృష్ణ ఇప్పటికీ హీరోగా రాణిస్తుండడం విశేషం. ఇప్పడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త కుర్రాళ్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్న బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యట్రిక్ కొట్టాడు. ఇప్పుడు కేఎస్ రవీంద్ర డైరెక్షన్లో 109 సినిమా మేకింగ్ అవుతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్, బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ జీవితం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అతిరథ మహులకు ఆహ్వానం పంపారు.