Tuesday, June 24, 2025

రెడిమేడ్ దుస్తులు కొనుగోలు చేసేవారికి షాక్..!

ఇప్పుడున్న వారిలో ఎక్కువ మంది రెడిమేడ్ దుస్తులు కొనుగోలు చేసేవారే ఉన్నారు. వీటిని ఎప్పటికీ కొనుగోలు చేసేవారు గతంలో కంటే ఇప్పడు ధరలు అధికంగా ఉన్నాయని అంటుంటారు. కానీ వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ను రెడీమేడ్ దుస్తులపై విదించనున్నారు. దీంతో రెడీమేడ్ దుస్తులు ధరలు పెరిగే అవకాశం ఉంది డిసెబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జీఎస్టీ రేటును రెడిమేడ్ వస్త్రాలపై విధించే అవకాశం ఉన్నట్లు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన నిర్వహించిన జీవోఎం సమావేశంలో చెప్పారు.

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ను నుంచి ఇప్పటి వరకు 5,12,28 అన మూడు రకాల స్లాబులతో పన్నును విధిస్తున్నారు. త్వరలో ఇది 28 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేసిన సమయంలో రూ.1,500 కంటే ఎక్కువగా ఉన్న వస్తువులపై 5 శాతం, రూ.10, 00 0 వరకు 18 శాతం, ఆ పైన అయిన మొత్తానికి 28 శాతం జీఎస్టీని విధించనున్నారు. సాధారణంగా దుస్తుల కంటే బ్రాండెడ్ కలిగిన రెడిమేడ్ దుస్తుల ధరలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిపై జీఎస్టీ 28 శాతం ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News