Tuesday, June 24, 2025

కొండ చరియలు విరిగిపడి 100 మంది సమాధి..

కొండచరియలు విరిగిపడి ఓ గ్రామం నేలమట్టమైంది. దీంతో ఈ గ్రామంలోని ఇళ్లలో ఉన్న దాదాపు 100 మంది మరణించినట్లు ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (ABC) తెలిపింది. పాపువా న్యూ గినియా రాజధాని ఫోర్ట్ మోర్స్ బీకి 600 కిలోమీటర్ల దూరంలో కొండ చరియల మధ్య కాక్లామ్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే చుట్టు పక్కల చెట్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచి బయటకు వెళ్లే మార్గం లేకపోయింది. దీంతో చాలా మంది ఇళ్ల శిథిలాల మధ్యే చిక్కుకున్నారు. మరణించిన వారి సంఖ్య 100కిపైగానే ఉంటుందని, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే తెలిపారు. కాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పాపువా న్యూ గినియా దేశంలో 10 మిలియన్ల జనాభా ఉంది. ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఇదే. ఇక్కడి ప్రజలు 800 భాషలు మాట్లాడుతారు. వీరి జీవనాధారం వ్యవసాయం. ఇదిలా ఉండగా కృత గాత్రులకు మౌలిక సదుపాయాలు అందించడానికి డిఫెన్స్ ఫోర్స్, వర్క్ అండ్ హైవేస్ ఆఫీసర్స్ ముందుకొచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News